ఏపీలో మరో 21 కరోనా పాజిటివ్ .. ఆ రెండు జిల్లాల్లో కలిపి 40కి చేరిన కేసులు

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో బుధవారం (01-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి గురువారం (02.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 21 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 132కి చేరాయి. జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.మొత్తం కేసుల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 కేసులు చొప్పున ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు.. విశాఖలో 11 కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8 కేసలు ఉన్నాయి. అయితే ఇవాళ నెల్లూరు జిల్లాలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి.